ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కనిగిరిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ శ్రీ డి. రామకృష్ణారెడ్డి గారు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఎలా అవతరించింది, రాజ్యాంగ అమలు ఎలా జరుగుతుంది, రాజ్యాంగంలోని విధులను పాటిస్తూ హక్కుల ని ఎలా ఉపయోగించుకోవాలి తదితర అంశాలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ రామకృష్ణ రెడ్డి, శ్రీమతి షనాజ్ బేగం, శ్రీ రామ కోటయ్య, శ్రీ రంగయ్య, శ్రీ నరేష్ రాజా, శ్రీ సాయి బ్రహ్మం, శ్రీ ఖాదర్ చందు, శ్రీమతి శోబా విన్నీ మరియు యు.వి విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
No comments:
Post a Comment